న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశంలోని మూడు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) క్యాంపస్లకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. జమ్ము, బౌద్ధ గయ, విశాఖపట్నంలలోని ఐఐఎం క్యాంపస్లను ఆయన ప్రారంభించారు. అలాగే మూడు ఐఐటీలు, 20 కేంద్రీయ విద్యాలయాలు, 13 నవోదయ పాఠశాలల శాశ్వత భవనాలు సహా 13,375 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఇందులో తెలంగాణలోని హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్ కూడా ఉంది. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ క్యాంపస్లో రూ.1,089 కోట్లతో చేపట్టిన పనులను, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని, పాలమూరు యూనివర్సిటీలో పీఎం ఉషా పథకాన్ని ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు.