‘ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే శక్తులు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. దేశంలో ఎమర్జెన్సీ మళ్లీ రాబోదని నేను అనుకోవట్లేదు’.. 2015లో ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ చేసిన వ్యాఖ్యలివి. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేండ్ల పాలనలో అత్యవసర స్థితి నాటి చీకటి రోజులు ప్రస్తుతం నెలకొన్నాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
PM Modi | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య ధ్వంసరచన అప్రతిహతంగా కొనసాగుతున్నది. కేంద్రం అరాచకాలను ప్రశ్నించిన గొంతుకలను పిసికి వేయడం పరిపాటిగా మారింది. 2002 గుజరాత్ అల్లర్ల ఘటన నుంచి నిన్నటి అదానీ వివాదం వరకూ ప్రతీ అంశం ఇందుకు మినహాయింపు కాదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 8 అంశాలపై ప్రతిపక్షాలు పెద్దయెత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, ప్రధాని మోదీ మౌనముద్రనే ఆశ్రయిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
చైనా దురాక్రమణ: లఢక్, అరుణాచల్ ప్రదేశ్లో చైనా దురాక్రమణకు పాల్పడుతున్నా.. కేంద్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. చైనాది పెద్ద ఎకానమీ అని, అలాంటి వాళ్లతో యుద్ధంలో మనం ఎలా గెలవగలమని విదేశాంగమంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
పుల్వామా ఘటన: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సైనికులు అమరులవ్వడానికి కేంద్రమే కారణమని, జవాన్ల మరణాలను మోదీ ఎన్నికల ప్రయోజనాలకు వాడుకొన్నారని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఓ కేసులో ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసింది.
అదానీ వివాదం: హిండెన్బర్గ్ ఆరోపణలు, అదానీ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పడిపోవడం, అదానీ-మోదీ బంధం తదితర అంశాలను ఉటంకిస్తూ పార్లమెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్.. ప్రధానిని ప్రత్యక్షంగా టార్గెట్ చేశారు. అనంతరం మోదీ’ ఇంటి పేరు కేసులో రాహుల్ను కోర్టు దోషిగా తేల్చి లోక్సభ సభ్యత్వం రద్దు చేసింది.
సూచీల్లో భారత్ ర్యాంకు: గడిచిన తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో ఆకలి సూచీ, హ్యాపీనెస్ ఇండెక్స్, పత్రికా స్వేచ్ఛ, సమానత్వ సూచీ, పర్యావరణం, మానవాభివృద్ధి, అవినీతిలేమి, పింఛన్ ఇలా 12 సూచీల్లో భారత్ ర్యాంకు మరింతగా దిగజారిపోయింది.
గుజరాత్ అల్లర్లు:
పెద్దనోట్ల రద్దు:
40 శాతం కమీషన్ రాజ్:
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంలో అవినీతి పరాకాష్టకు చేరింది. ప్రజాప్రతినిధుల అధికార దాహానికి పలువురు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకొన్న ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అయితే, దీనిపై ప్రధాని ఇప్పటివరకూ నోరుమెదపలేదు.
కొవిడ్ మరణాలు:
భారత్లో కరోనా మరణాల లెక్కలను కేంద్రప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కిందటేడాది ఆరోపించింది. ప్రభుత్వ గణాంకాల కంటే 10 రెట్లు ఎక్కువ మరణాలు సంభవించినట్టు తెలిపింది. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది.