దేశ భద్రత, ఉక్రెయిన్- రష్యా మధ్య కొనసాగుతున్న యుద్థంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పాటు పలువురు సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో దేశ భద్రత, ప్రపంచ పరిణామాలపై ఈ సమావేశం లోతుగా చర్చించనుంది.
అటు రష్యా, ఇటు ఉక్రెయిన్.. రెండు దేశాలతోనూ భారత్కు అవసరాలున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే. రాజకీయంగా, ఆర్థికంగా, భద్రతా పరంగా, విద్యా పరంగా భారత్ ఈ రెండు దేశాలతోనూ సంబంధాలను కలిగి వుందన్నారు. అయితే భారత్ మాత్రం శాంతినే కోరుకుంటుందని, శాంతివైపే మొగ్గు చూపుతుందని, తొందర్లోనే రష్యా ఉక్రెయిన్ మధ్య వాతావరణం మామూలు స్థాయికి చేరుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.