న్యూఢిల్లీ: ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ రెండు రోజుల కువైట్ పర్యటనకు వెళ్లారు. భారత్, గల్ఫ్ దేశాల మధ్య శాంతి, భద్రత, స్థిరత్వం ముఖ్యమన్నారు. సిరియాలో అసద్ బాషర్ ప్రభుత్వం నిర్వీర్యం కావడం, గాజాలో ఇజ్రాయిల్ దాడులు పెంచిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ గల్ఫ్ పర్యటన చేపట్టడం ఆసక్తిని పెంచింది. కువైట్ టాప్ నేతలతో చర్చలు జరపనున్నామని, రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని పెంచుకోనున్నట్లు వెల్లడించారు. సుమారు 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని కువైట్ పర్యటనకు వెళ్తున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న చరిత్రాత్మక సంబంధాలను గౌరవిస్తున్నట్లు చెప్పారు. వాణిజ్యం అంశంలో రెండు దేశాల మధ్య బంధం బలంగా ఉందన్నారు.
Today and tomorrow, I will be visiting Kuwait. This visit will deepen India’s historical linkages with Kuwait. I look forward to meeting His Highness the Amir, the Crown Prince and the Prime Minister of Kuwait.
This evening, I will be interacting with the Indian community and…
— Narendra Modi (@narendramodi) December 21, 2024