కోల్కతా: ప్రధాని మోదీ(PM Modi) శుక్రవారం హూగ్లీ నదిలో విహరించారు. ఓ కెమెరాతో ఆయన ఆ నదిలో విహరిస్తూ కొన్ని ఫోటోలు తీశారు. గంగా నదికి ఆయన పూజలు కూడా చేశారు. ఏప్రిల్ 29వ తేదీ రోజున రెండో దఫా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బెంగాలీ నావికులతో కాసేపు గడిపారు. వారి డిమాండ్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. బోటులో షికారు చేస్తూ ప్రధాని మోదీ తన చేతిలో ఉన్న కెమెరాతో ఫోటోలు తీశారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో ఫోటోలు షేర్ చేశారు.
গতকাল সন্ধ্যায়, হাওড়া থেকে কলকাতা পর্যন্ত দীর্ঘ রোড-শো’র সময় হাওড়া ব্রিজের ওপর ছিলাম। আর আজ সকালে, হুগলি নদী থেকে এই ব্রিজকে দেখলাম! pic.twitter.com/UQgblRsetj
— Narendra Modi (@narendramodi) April 24, 2026
బెంగాలీలకు గంగా నది ఓ ప్రత్యేక స్థానం అని, బెంగాలీ ఆత్మలో గంగా నది ప్రవహిస్తుందని అంటారని, ఆ పవిత్ర నది ఈ దేశ నాగరికత స్పూర్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఇవాళ ఉదయం కోల్కతాలోని హూగ్లీ నది తీరంలో కొంత సమయం వెచ్చించానని, గంగా నదికి కృతజ్ఞత చెప్పే సందర్భం ఇది అని తన ఎక్స్లో రాశారు. స్థానిక నావికులతో పాటు మార్నింగ్ వాక్ వచ్చినవారితో మోదీ కలిశారు. విద్యాసాగర్ సేతు, హౌరా బ్రిడ్జ్ను అతిసమీపం నుంచి చూసినట్లు చెప్పారు. తొలిదశ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ ఓ షాపుకు వెళ్లి జాల్ముడి తిన్న విషయం తెలిసిందే.
প্রত্যেক বাঙালির কাছে গঙ্গা একটি অত্যন্ত বিশেষ স্থান অধিকার করে আছে। বলা যায়, গঙ্গা যেন বাংলার আত্মার মধ্য দিয়ে প্রবাহিত হয়। পবিত্র গঙ্গা জল সমগ্র সভ্যতার চিরন্তন চেতনা বহন করে চলেছে।
আজ সকালে কলকাতায় আমি হুগলি নদীর তীরে কিছু সময় কাটিয়েছি—মা গঙ্গার প্রতি কৃতজ্ঞতা প্রকাশের… pic.twitter.com/P3oZOywjKf
— Narendra Modi (@narendramodi) April 24, 2026