ఢిల్లీ: నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చురల్ సెంటర్లో జరుగుతున్న పాలకమండలి సమావేశానికి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులైన కేంద్ర మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, సీఎంలు మమతా బెనర్జీ, శివరాజ్ సింగ్ చౌహన్, భగవంత్ మాన్, వైఎస్ జగన్ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 2019 తర్వాత నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం ప్రత్యక్షంగా జరగడం ఇదే మొదటిసారి.
సమావేశం అజెండాలో ప్రత్యామ్నాయ పంటల సాగు, నూనె, పప్పుల పంటల సాగులో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానం అమలు, పట్టణాభివృద్ధి, వివిధ రంగాలలో భారత్ ఆత్మ నిర్భర్ సాధించేందుకు కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా ఈ సమావేశాన్ని సీఎం కేసీఆర్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బహిష్కరించారు.
#WATCH | PM Narendra Modi chairs the 7th Governing Council meeting of Niti Aayog at Rashtrapati Bhawan Cultural Centre. pic.twitter.com/6EJyyYFwMd
— ANI (@ANI) August 7, 2022