ప్రధాని నరేంద్ర మోదీ తన వారణాసి పర్యటనలో భాగంగా దశాశ్వమేధ ఘాట్లో నిర్వహించే గంగా హారతికి హాజరయ్యారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన తర్వాత మోదీ ఓ ట్వీట్ చేశారు. ”కాశీలో నిర్వహించే గంగా హారతి ఎప్పుడూ మనస్సుకు నూతన ఉత్తేజాన్ని, శక్తినిస్తుంది. ఈ రోజు ఓ పెద్ద ఘట్టం ఆవిష్కరించిన తర్వాత దశాశ్వమేధ ఘాట్లో జరిగే గంగా హారతికి హాజరయ్యా. గంగా మాత ఆశీస్సులు కావాలని ప్రార్థించా. నమామి గంగే తవ పాద పంకజం” అని మోదీ ట్వీట్ చేశారు.