PM Modi | దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది (Lok Sabha Elections). ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకే తొలి దశ పోలింగ్ (Polling) ప్రారంభమైంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దీంతో సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివెళ్తున్నారు. ఇక తొలి విడత పోలింగ్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దేశ ప్రజలకు ఓ సందేశాన్నిచ్చారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
‘2024 లోక్సభ ఎన్నికలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి..! మొత్తం 21 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఓటు వేసే వారంతా తమ ఓటు హక్కును రికార్డు సంఖ్యలో వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా యువకులు, తొలిసారి ఓటు వేయనున్నవారు అధిక సంఖ్యలో తరలిరావాలని ప్రత్యేకంగా పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్కరి ఓటూ చాలా ముఖ్యమైనదే..!’ అంటూ ట్వీట్లో మోదీ రాసుకొచ్చారు.
కాగా, సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడత పోలింగ్ నేటి నుంచి ప్రారంభమైంది. ఇక తొలి విడత ఎన్నికల్లో మొత్తం 1,625 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 1491 మంది పురుషులు కాగా, 134 మంది మహిళా అభ్యర్థులు. మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.
The 2024 Lok Sabha elections commence today! As 102 seats across 21 States and UTs go to the polls, I urge all those voting in these seats to exercise their franchise in record numbers. I particularly call upon the young and first time voters to vote in large numbers. After all,…
— Narendra Modi (@narendramodi) April 19, 2024
Also Read..
Lok Sabha Elections | సార్వత్రిక సమరం.. కొనసాగుతున్న తొలిదశ ఎన్నికల పోలింగ్
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలు.. ఓటుహక్కు వినియోగించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్
Vote for Note Case | ఓటుకు నోటు కేసు.. విచారణను జూలై 24కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు