న్యూఢిల్లీ, ఆగస్టు 6: దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’లో భాగంగా 27 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పలు రైల్వేస్టేషన్లలో పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.
రైల్వేస్టేషన్లలో అత్యాధునిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఇతర సాంకేతిక పరమైన అంశాలను అభివృద్ధి చేయనున్నట్టు ప్రధాని కార్యాలయం పేర్కొన్నది.