న్యూఢిల్లీ : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్రం శుక్రవారం దేశవ్యాప్తంగా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో రూ.2వేలు జమ చేయబోతున్నది. దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతులకు దాదాపు రూ.18,640 కోట్లను అందజేస్తున్నట్టు కేంద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ పథకం కింద ఏటా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు రూ.6 వేలు మూడు సమాన వాయిదాల్లో అందుతున్నాయి. శుక్రవారం గువాహటిలో ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ కిసాన్ నిధి పథకం 22వ వాయిదా నిధులను విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.4.27 లక్షల కోట్లు జమచేశామని కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు.