పనాజీ: పోప్ ఫ్రాన్సిస్(Pope Francis)ను ప్రధాని మోదీ ఇండియాకు ఆహ్వానించినట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. పోప్ను ప్రధాని మోదీ ఆహ్వానించారని, ఒకవేళ ఆయన ఇండియాకు వస్తే, గోవాకు కూడా వస్తారని ఆశిస్తున్నట్లు సీఎం ప్రమోద్ సావంత్ వెల్లడించారు. ఇటలీలో జరిగిన జీ7 సమావేశాలకు ప్రధాని మోదీ హాజరైన విషయం తెలిసిందే. అక్కడ వివిధ దేశాధినేతలతో పాటు పోప్ ఫ్రాన్సిస్ను కూడా మోదీ కలిశారు. భారత్ను విజిట్ చేయాలని పోప్ను ఆహ్వానించినట్లు సీఎం ప్రమోద్ తన ఎక్స్ అకౌంట్లో గుర్తు చేశారు. ఓల్డ్ గోవాలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ గ్జావియర్ చర్చి సంబరాలకు పోప్ ఫ్రాన్సిస్ను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసినట్లు గోవా సీఎం ఇటీవల తెలిపారు. గోవా జనాభాలో క్రైస్తవులు 27 శాతం ఉన్నారు.
Met Pope Francis on the sidelines of the @G7 Summit. I admire his commitment to serve people and make our planet better. Also invited him to visit India. @Pontifex pic.twitter.com/BeIPkdRpUD
— Narendra Modi (@narendramodi) June 14, 2024