న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు తనకు టికెట్ నిరాకరించడంపై బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ స్పందించారు. నాథూరాం గాడ్సేను పొగుడుతూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ప్రధానికి నచ్చలేదని, టికెట్ నిరాకరించడం ద్వారా తనను ఆయన క్షమించలేదని స్పష్టమవుతున్నదని ఆమె పేర్కొన్నారు. 195 మంది అభ్యర్థులతో బీజేపీ ఇటీవలే మొదటి జాబితాను ప్రకటించింది. ఇందులో సుమారు 33 మంది సిట్టింగ్లకు అవకాశం రాలేదు. వారిలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఒకరు.