న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ‘పీఎం కేర్స్ ఫండ్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. అది రాజ్యాంగం కింద గానీ ఇతర ఏ చట్టం పరిధిలో గానీ ఏర్పాటుచేసిన సంస్థ కాదు. దానికి అందే విరాళాలు ప్రభుత్వ ఖజానాకు వెళ్లవు’ అని ఢిల్లీ హైకోర్టులో ప్రధాని కార్యాలయం (పీఎంవో) అఫిడవిట్ దాఖలుచేసింది. పీఎం కేర్స్ ట్రస్ట్ కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ఉండదని తెలిపింది. ఆర్టీఐ కింద పీఎం కేర్స్ ఫండ్ థర్డ్ పార్టీ సమాచారాన్ని వెల్లడించలేమని పేర్కొన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 కింద పీఎం కేర్స్ ఫండ్ను ప్రభుత్వ సంస్థగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్పై ఈ మేరకు అఫిడవిట్ ఇచ్చింది.