న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్(Delhi Budget)ను ఇవాళ ప్రవేశపెట్టకుండా నిలిపివేశారు. ఈ అంశంపై ప్రధాని మోదీ(PM Modi)కి ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్(Kejriwal) లేఖ రాశారు. ఢిల్లీ బడ్జెట్ను ఆపకండి అంటూ ఆయన తన లేఖలో ప్రధానిని అభ్యర్థించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రం మధ్య వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో .. ఆప్ సర్కార్ రాష్ట్ర బడ్జెట్ను నిలిపివేసింది. వివిధ రంగాల కేటాయింపుల(Allocations) విషయంలో కేంద్రం, ఢిల్లీ మధ్య వివాదం చెలరేగుతున్నట్లు తెలుస్తోంది.
గత 75 ఏళ్లలో తొలిసారి ఓ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ వాసుల(Delhi Public)తో మీరెందుకు ఇంత అప్సెట్గా ఉన్నారని, ప్లీజ్ ఢిల్లీ బడ్జెట్ను ఆపకండి, చేతులు జోడించి నమస్కరిస్తున్నా, బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ఢిల్లీ ప్రజలు కోరుతున్నట్లు సీఎం కేజ్రీవాల్ తన లేఖలో తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కేంద్ర హోంశాఖ(Home Ministry) అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అడ్వర్టైజ్మెంట్లకు అధిక కేటాయింపులు ఉన్నాయని, కానీ అభివృద్ధి పనులకు, మౌళిక సదుపాయాల కోసం కేటాయింపులు లేవని ఆప్ సర్కార్పై కేంద్రం ఆగ్రహంగా ఉంది.