ముంబై, ఫిబ్రవరి 1: కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాల కారణంగా తమ కుమార్తె మరణించిందని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి చెందిన దిలీప్ లునావత్ అనే వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. కేంద్రం, మహారాష్ట్ర సర్కార్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి రూ.వెయ్యి కోట్ల పరిహారం ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మెడికల్ విద్యార్థిని అయిన తన కుమార్తె స్నేహల్ గతేడాది జనవరి 28న వ్యాక్సిన్ తీసుకున్నదని, మార్చి 1న మరణించిందని పేర్కొన్నారు.