న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న గేట్ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పిటిషన్ను విచారణ జాబితాలో చేర్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం పిటిషన్పై విచారణ చేపట్టనున్నది. గేట్ పరీక్షపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయవాది పల్లవ్ మోంగియా ఈ పిటిషన్ దాఖలు చేశారు. శనివారం ప్రారంభం కానున్న ఈ పరీక్షను 9 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారని దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.