మహారాష్ట్రలో ఓ వైద్యుడి ప్రిస్క్రిప్షన్
థానే, ఏప్రిల్ 24: దేశమంతా ఆక్సిజన్ కొరతపై చర్చ నడుస్తున్న వేళ మహారాష్ట్రలో ఓ డాక్టర్ తన వద్దకు వచ్చే రోగులను మొక్క నాటాలని కోరుతున్నాడు. రోగులకు మందులతో పాటు మొక్కను నాటాలంటూ ప్రిస్క్రిప్షన్లో సూచిస్తున్నాడు. ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు అవసరమని వారిలో అవగాహన పెంచుతున్నాడు. అహ్మద్నగర్కు చెందిన ఈ వైద్యుడి పేరు కోమల్. ‘కొన్నాళ్లుగా నాకు ఆక్సిజన్ సరఫరా గురించి ఫోన్లు వస్తున్నాయి. అప్పుడే మొక్కనాటేలా ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది’ అని కోమల్ చెప్పారు.