చెన్నై, ఏప్రిల్ 8: ఐఐటీలు అంటేనే ఉద్యోగం గ్యారెంటీ అన్న భరోసా. కానీ, ఐఐటీ మద్రాస్లో 45 శాతం మంది విద్యార్థులకు ప్లేస్మెంట్లు దక్కలేదట. ధీరజ్ సింగ్ అనే వ్యక్తి ఆర్టీఐ దరఖాస్తు పెట్టుకోగా, ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే విద్యార్థుల ప్లేస్మెంట్లపై ఐఐటీ మద్రాస్ యాజమాన్యం స్పందించింది. ప్లేస్మెంట్లు ఇంకా కొనసాగుతున్నాయని, 2024 జూలై వరకు పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. 45 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదడాన్ని ఖండించింది. ప్లేస్మెంట్లు ఇంకా కొనసాగుతున్నందున.. ఎలా ఉద్యోగాలు రాలేదని వ్యాఖ్యానిస్తారని మండిపడింది. స్నాతకోత్సవం అనంతరం ప్లేస్మెంట్లపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నది.