Piyush Goyal | దేశంలో స్టార్టప్ ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేయడానికి కేంద్రం అన్ని చర్యలూ చేపడుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పన్నుల సరళీకరణ, స్వీయ ధృవీకరణ లాంటి ముఖ్య నిర్ణయాలను తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో స్టార్టప్ కంపెనీలకు చాలా అవకాశాలు ఉన్నాయని, అలాగే అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, ప్రొఫెషనల్ సర్వీసెస్తో పాటు వివిధ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. నాస్కామ్ టెక్నాలజీ స్టార్టప్ రిపోర్టును ప్రారంభిస్తూ పీయూశ్ గోయల్ పై వ్యాఖ్యలు చేశారు. ‘స్టార్టప్ ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేయడానికి ముఖ్య నిర్ణయాలే తీసుకుంటున్నా. కొన్ని రోజుల్లో కేంద్ర బడ్జెట్ కూడా రాబోతోంది. ఎంతో ఆత్రుతగా ఎదిరి చూస్తున్నాం.’ అని గోయల్ ప్రకటించారు.