తిరువనంతపురం, ఆగస్టు 20: కేంద్రంలోని మోదీ సర్కారు తీరుపై కేరళ సీఎం పినరయి విజయన్ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ర్టాన్ని ఆర్థికంగా దిగ్బంధం చేస్తున్నదని, అభివృద్ధిని అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. రాష్ర్టాలకున్న పరిమిత హక్కులనూ లాగేసుకునేందుకు కేంద్రంపై ధ్వజమెత్తారు. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేరళకు దక్కాల్సిన రెవెన్యూ గ్రాంట్ను తగ్గించటంపై కేంద్రం తీరును ఎండగట్టారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ, ఒకవిధమైన ఆర్థిక ఒత్తిడి పెట్టి రాష్ర్టాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేలా చేస్తున్నదని ఆరోపించారు.