న్యూఢిల్లీ: కులగణన సహితంగా జనాభా లెక్కలు చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ప్రభుత్వాలకు సంక్షేమ విధానాలను రూపొందించేందుకు కులాల వారీగా లెక్కలు అవసరమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
కులాలకు సంబంధించిన వివరాలు, గణాంకాలు, ప్రభుత్వాల వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్నాయంటూ పిటిషినర్ సుధాకర్ గుమ్ముల చేసిన వాదనలతో ప్రధా న న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలీలతో కూడిన ధర్మాసనం ఏకీభవించక వ్యాజ్యాన్ని కొట్టివేసింది.