ముంబై : కుక్కలు స్వైరవిహారం చేస్తూ పిల్లలతో పాటు పెద్దలపైనా దాడి చేస్తున్న ఘటనలు పెరుగుతుండగా తాజాగా ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై పంది దాడి చేసింది. మహారాష్ట్రలోని గోండా జిల్లాలో జరిగిన ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
బాలుడు ఇంటి బయట స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా అటుగా వచ్చిన పంది బాలుడిపైకి దూకి దాడి చేసింది. పెద్దలు అక్కడకు చేరుకుని బాలుడిని కాపాడేవరకూ పంది అతడిపై దాడికి తెగబడుతూనేఉంది. స్ధానిక ఆస్పత్రిలో బాలుడు చికిత్స పొందుతుండగా ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటన అంతా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.