లేహ్: కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో బీజేపీ అధ్యక్షుడిగా ఫంచొక్ స్టాంజిన్ నియమితులయ్యారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్టాంజిన్ను లడఖ్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా.. ఫంచొక్ స్టాంజిన్ను లడఖ్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చింది అంటూ బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ అరుణ్సింగ్ ఓ ప్రకటన చేశారు.
కాగా, కేంద్ర సర్కారు కొంతకాలం క్రితం జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. జమ్ముకశ్మీర్ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ను మరో కేంద్రపాలిత ప్రాంతంగా విడదీసింది. ప్రస్తుతం బీజేపీ కేంద్ర నాయకత్వం లడఖ్ బీజేపీ శాఖకు స్టాంజిన్ను అధ్యక్షుడిగా నియమించింది.