చెన్నై : ప్రముఖ ఫార్మా దిగ్గజం ఫైజర్ కంపెనీ తమిళనాడులోని చెన్నై ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్లో గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు ఏర్పాటు చేసింది. ఫైజర్ కంపెనీ ఆసియాలో తొలి గ్లోబ్ డ్రగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. కీలకమైన పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఏర్పాటు చేసింది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, ఫినిష్డ్ డోసేజ్ ఫార్మ్స్ (FDFs), కాంప్లెక్స్, యాడెడ్ ఫార్ములేషన్, కంట్రోల్డ్- రిలీజ్ డోసెజ్ ఫార్మ్, డివైజ్ కాంబినేషన్ ప్రాడక్ట్స్, పౌడర్ ఫిల్ ప్రొడక్ట్స్, లైయోఫైలైజ్డ్ ఇంజెక్షన్లు తదితర అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా ఫైజర్ ఇండియా మేనేజర్ ఎస్ శ్రీధర్ మాట్లాడుతూ ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్లోని ఫైజర్ డ్రగ్ డెవలప్మెంట్ సెంటర్ చెన్నైలో ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.