వాషింగ్టన్: కరోనావైరస్ ను నిరోధించడానికి ప్రముఖ ఫార్మా దిగ్గజం ఫైజర్ మరో కొత్త ఔషధాన్ని రూపొందించింది. ఈ మందును ప్రయోగించగా 89శాతం వరకు వ్యాధి తీవ్రతను తగ్గించినట్లు ఫలితాలు చెబుతున్నాయి. అక్టోబర్ లో కరోనాతో బాధపడుతున్న కొందరి రోగులపై ఈ మందును ప్రయోగించగా వ్యాధి తీవ్రతను సగానికి పైగా తగ్గించమేకాకుండా ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు ఫైజర్ తెలిపింది. ఈ ఫలితాలను యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కు సమర్పించాలని యోచిస్తున్నట్లు ఫైజర్ పేర్కొంది.
పాక్స్లోవిడ్ అనే బ్రాండ్ పేరుతో ఉన్న కాంబినేషన్ ట్రీట్మెంట్లో భాగంగా రోగులకు రోజుకు రెండుసార్లు మూడు మాత్రలు ఇచ్చారు. ఈ అధ్యయనంలో 1,219 మంది రోగులుపాల్గొన్నారు. అందులో ఊబకాయం ఉన్నవాళ్లు , వృద్దులు కూడా ఉన్నారు. అయితే వ్యాధి లక్షణాలు కనిపించిన మూడు రోజులలోపు ఫైజర్ ఔషధం ఇచ్చిన వారిలో 0.8శాతం మంది ఆసుపత్రిలో చేరిన వారికీ ఈ మందు వేశారు. ట్రీట్మెంట్ ఇచ్చిన 28 రోజుల తర్వాత మరణాల రేటు తగ్గినట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఒక రోగి చికిత్స పొందిన ఐదు రోజుల తర్వాత కొంత ప్రభావం కనిపించిందని ఫైజర్ ప్రోగ్రామ్ హెడ్ అన్నలీసా ఆండర్సన్ అన్నారు. పూర్తిస్థాయిలో మందు పనిచేయాలంటే ఐదురోజుల కంటే ఎక్కువ సమయం పడుతుందని ఆండర్సన్ తెలిపారు.