లీటరు పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైసలు పెంపు
న్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా నాల్గో రోజూ పెరిగాయి. ఆదివారం లీటరు పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. వరుస పెంపులతో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా లీటరు పెట్రోల్ ధర రూ.102.39కి పెరుగగా.. ముంబైలో రూ.108.43కి చేరింది. డీజిల్ ధర ఢిల్లీలో రూ.90.77 చేరింది. ముంబైలో రూ.98.48కి ఎగబాకింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పెరుగడంతోనే ఇంధన ధరలను పెంచాల్సి వస్తున్నదని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి.