న్యూఢిల్లీ, మార్చి 25: సామాన్యుల నడ్డివిరిచేలా కేంద్రం మరోసారి ఇంధన ధరలు పెంచింది. లీటరు పెట్రోల్పై 90 పైసలు, లీటరు డీజిల్పై 87 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు శుక్రవారం నిర్ణయం తీసుకొన్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ. 110.91కి పెరగ్గా, లీటరు డీజిల్ ధర రూ. 97.24కి ఎగబాకింది. నాలుగురోజుల్లో మూడుసార్లు ఇంధన ధరలు పెంచిన కేంద్రం.. పెట్రోల్పై మొత్తంగా దాదాపు రూ.3 వరకు వడ్డించడం గమనార్హం. మరోవైపు, పెట్రో ధరల పెంపును నిరసిస్తూ విపక్ష ఎంపీలు శుక్రవారం లోక్సభలో పెద్దయెత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగియగానే కేంద్రం పెట్రోబాదుడుకు దిగిందని మండిపడ్డారు. అనంతరం లోక్సభ నుంచి వాకౌట్ చేశారు.