న్యూఢిల్లీ, జూన్ 26: కేవలం 54 రోజుల్లో లీటరు పెట్రోల్పై రూ.7.71, డీజిల్పై రూ.8.12 పెరిగింది. మే 4 నుంచి శనివారం నాటికి అంటే 54 రోజుల్లో 30 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. శనివారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలు పెరిగింది. ప్రస్తుతం రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.30కి చేరగా.. డీజిల్ ధర రూ.101.85కి పెరిగింది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, బీహార్, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 పలుకుతున్నది.