న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపు కొనసాగుతూనే ఉన్నది. మంగళవారం లీటరు పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో ఇంధన ధరలు రికార్డుస్థాయికి చేరాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 102.64కు చేరగా.. డీజిల్ ధర రూ.91.07కు పెరిగింది. అలాగే ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.108.67కు ఎగబాకగా.. డీజిల్ ధర రూ.98.80కి చేరుకుంది. చాలా రాష్ర్టాల్లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధర రూ.100 దాటింది.