న్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. గురువారం కూడా లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా లీటరు పెట్రోల్ ధర రూ.103.24కు పెరుగగా.. ముంబైలో రూ.109.25కి చేరింది. అలాగే లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ.91.42కు ఎగబాకగా.. ముంబైలో రూ.99.55కి పెరిగింది. ప్రస్తుతం డెహ్రాడూన్, చండీగఢ్, గువాహటి, రాంచీ తప్ప అన్ని రాష్ర్టాల రాజధానుల్లోనూ లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటేసింది.