వెల్లూర్ కాలేజీలో ‘కొవాగ్జిన్-కొవిషీల్డ్’ ట్రయల్స్
న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశీయ వ్యాక్సినేషన్లో వినియోగిస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్కు సంబంధించిన అధ్యయనానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చింది. తాజా నిర్ణయంతో 300 మంది వలంటీర్లపై వెల్లూర్లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో త్వరలో ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది. మరోవైపు, తమ సంస్థ అభివృద్ధి చేసిన రెండు టీకాలు ‘కొవాగ్జిన్’, బీబీవీ154 (నాజల్ టీకా)ను మిక్సింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న భారత్ బయోటెక్ విజ్ఞప్తిపై డీసీజీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.