చండీగఢ్: పదో తరగతి పరీక్షల్లో చీటింగ్కు పాల్పడ్డారు. విద్యార్థులకు స్లిప్స్ అందించేందుకు కొందరు వ్యక్తులు స్కూల్ గోడలు ఎక్కారు. (People climb school walls) దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హర్యానాలోని నుహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం పదో తరగతి బోర్టు పరీక్షలు ప్రారంభమైన కొంతసేపటి తర్వాత ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందని వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తౌరులోని చంద్రావతి స్కూల్లో గందరగోళం తలెత్తింది. పదో తరగతి బోర్డు పరీక్షలు రాస్తున్న తమ విద్యార్థులకు చీటీలు అందించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. దీని కోసం తాడు, నిచ్చెన సహాయంతో ఆ పరీక్షా కేంద్రం గోడలు ఎక్కారు.
కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ బ్లాక్ విద్యాశాఖ అధికారి దీనిపై స్పందించారు. పరీక్షల్లో మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బందిని పెంచాలని వారిని కోరుతామని వెల్లడించారు.
People climb school walls to pass chits to students writing their class 10 board exam in Haryana 👀pic.twitter.com/v7drerUusE
— The Whatup (@TheWhatup) March 7, 2024