శ్రీనగర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. జమ్ముకశ్మీర్లో కొనసాగుతున్న ఈ యాత్రను శుక్రవారం భద్రతా లోపాల వల్ల రాహుల్ గాంధీ మధ్యలోనే నిలిపివేశారు. శనివారం అవంతిపోరా నుంచి యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ కొందరు మహిళలతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. చుర్సు నుంచి కొంతదూరం రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ యాత్రలో తిరిగి పాల్గొనేందుకు ప్రియాంక గాంధీ కూడా శ్రీనగర్ చేరుకున్నారు.
కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ చేపట్టారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెలాఖరున జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో ముగియనున్నది. యాత్ర ముగింపు సభకు సుమారు 20కిపైగా ప్రతిపక్ష పార్టీలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది.
#WATCH | Congress party's Bharat Jodo Yatra resumes from Awantipora, Jammu & Kashmir. PDP chief Mehbooba Mufti joins Rahul Gandhi in the yatra.
(Video: AICC) pic.twitter.com/l3fLfIoTu5
— ANI (@ANI) January 28, 2023