పాట్నా : బిహార్ పాట్నా జిల్లాలో ఆదివారం జరిగిన పార్కింగ్ విషయంలో ఇరువర్గాల మధ్య ఘరణ జరిగింది. ఓ వర్గం ఇండ్లకు నిప్పుపెట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం ప్రకారం.. జెతులి గ్రామంలో ఆదివారం పార్కింగ్ విషయంలో వివాదం తలెత్తింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, అలాగే ఇతర నిందితులను పట్టుకునేందుకు మాన్హాంట్ పోలీసులు గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
పార్కింగ్ విషయంలో అల్లరిమూకల మధ్య మధ్య వివాదం చేలరేగి.. హింసకు దారితీసింది. రెండువర్గాల మధ్య దాదాపు 50 రౌండ్లు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత అల్లరి మూకలు ఇండ్లు, కల్యాణ మండపాలకు నిప్పుపెట్టాయి. అయితే, అల్లరిమూకలు కాల్పులు జరుపుతున్న సమయంలో పోలీసులు సంఘటనా స్థలంలోనే ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఘటనలో ఇద్దరు గాయపడగా.. పలువురి గాయపడ్డారు. వారిని స్థానికుల సహాయంతో పోలీసులు పాట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రి, నలందా ఆసుప్రతులకు తరలించినట్లు సీనియర్ ఎస్పీ మానవ్ జీత్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు.