కొవిన్ పోర్టల్లో వెసులుబాటు
న్యూఢిల్లీ, జూన్ 26: కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో అన్ని దేశాలు విదేశీయుల రాకపై ఆంక్షలు విధిస్తున్నాయి. చాలా దేశాలు వ్యాక్సిన్ వేసుకొన్న వారినే తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశాల్లో చదువుకొనే విద్యార్థులు, క్రీడాకారులు తదితరుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పాస్పోర్టులతో అనుసంధానం చేస్తామని ఫలితంగా ప్రయాణం సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్తో పాస్పోర్టు నంబర్ను అనుసంధానం చేసుకొనే వెసులుబాటు కొవిన్ పోర్టల్లో అందుబాటులోకి వచ్చింది.