చెన్నై, నవంబర్ 8: రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా శవంతో 600 కిలోమీటర్ల పాటు ప్రయాణించాల్సిన దుస్థితి ప్రయాణికులకు ఏర్పడింది. చెన్నై నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. ప్రయాణికులు పలుసార్లు ఫిర్యాదు చేయడంతోయూపీలోని ఝాన్సీలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. యూపీలోని బాంద్రా జిల్లాకు చెందిన రాంజిత్ యాదవ్ స్వగ్రామానికి వెళ్తుండగా అనారోగ్యానికి గురై రైల్లోనే మరణించాడు.