న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నఓ వీడియోపై ఢిల్లీ మహిళా కమిషన్ ( DCW) స్పందించింది. బుధవారం ఢిల్లీ నుంచి ముంబై వెళుతున్న విమానంలో ప్రయాణీకుడికి లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలకు సంబంధించి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. నిందితుడు సహ ప్రయాణీకురాలితో పాటు ఎయిర్లైన్స్ మహిళా ఉద్యోగి అభ్యంతరకర ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనలో ఢిల్లీ పోలీసులతో పాటు, పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఐ)కు నోటీసులు జారీ చేశామని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. విమానంలో ఓ ప్రయాణీకుడి అభ్యంతరకర ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రాంలో వైరల్ అవుతుండగా, ఈ వీడియో ఆధారంగా డీసీడబ్ల్యూ సుమోటోగా స్పందించింది.
ఈనెల 16న ఢిల్లీ నుంచి ముంబై వెళుతున్న స్పైస్జెట్ 157 ఫ్లైట్లో ఈ ఘటన జరిగినట్టు తెలిసిందని నోటీసులో డీసీడబ్ల్యూ పేర్కొంది. నిందితుడి మొబైల్ ఫోన్ను తనిఖీ చేయగా అందులో విమానంలో ప్రయాణిస్తున్న మహిళల అభ్యంతరకర ఫొటోలు ఉన్నట్టు వెల్లడైందని పేర్కొంది. ఈ ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ, అరెస్టయిన నిందితుల వివరాలు, తీసుకున్న చర్యలతో సవివర నివేదిక అందచేయాలని ఢిల్లీ పోలీసులకు జారీ చేసిన నోటీసులో డీసీడబ్ల్యూ కోరింది. నిందితుడిని అరెస్ట్ చేయనిపక్షంలో అందుకు కారణాలను తెలియచేయాలని పేర్కొంది.
Read More :
Malla Rajireddy | మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి.. ధ్రువీకరించిన ఛత్తీస్గఢ్ పోలీసులు