న్యూఢిల్లీ, జనవరి 5: ఖైదీల ముందస్తు విడుదల విషయంలో అప్పటివరకు ఆ వ్యక్తి పెరోల్ కింద వినియోగించుకున్న రోజులను అతని శిక్షాకాలంలో కలపరాదని, దానిని మినహాయించాలని సుప్రీం కోర్టు గురువారం తీర్పునిచ్చింది. దీనిపై ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ రవికుమార్తో కూడిన ధర్మాసనం సమర్థించింది. పెరోల్లో ఉన్న రోజులను కూడా శిక్షాకాలంలో కలిపితే పలుకుబడి ఉన్న వ్యక్తులు చాలాసార్లు పెరోల్ పొంది బయటే ఉంటారన్నారు. అలాంటప్పడు న్యాయస్థానం అతనికి శిక్ష విధించిన లక్ష్యం నెరవేరదని ధర్మాసనం పేర్కొంది.