న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తాజా ఘర్షణలపై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. కేంద్ర ప్రభుత్వ మెతక వైఖరివల్లే చైనా మాటిమాటికి రెచ్చిపోతున్నదని, తాజా ఘర్షణలపై పార్లమెంట్లో చర్చ జరపాల్సిందేనని ఉభయసభల్లో విపక్ష సభ్యులు పట్టుబట్టారు. అటు లోక్సభలో స్పీకర్, ఇటు రాజ్యసభలో చైర్మన్ సభను కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు.. 21 సంవత్సరాల క్రితం ఇదే రోజున పార్లమెంట్పై జరిగిన ఉగ్రదాడిని పార్లమెంట్ ఉభయసభలు గుర్తుచేసుకున్నాయి. ఆ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భద్రతాసిబ్బందికి నివాళులు అర్పించాయి. ఆ తర్వాత విపక్ష సభ్యులు ఘర్షణలపై చర్చకు పట్టుబట్టడంతో ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదాపడ్డాయి.