న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేట్ మెంబర్స్ బిజినెస్ అనేవి లేకుండా ఈ సమావేశాలు ఉంటాయని లోక్సభ, రాజ్యసభ కార్యదర్శులు శనివారం వేరువేరుగా నోటిఫికేషన్ జారీచేశారు. ‘17వ లోక్సభ 13వ సెషన్ ఈ నెల 18న ప్రారంభంకానున్నది. ఈ సమావేశాల ఎజెండా ఏంటన్నది మాత్రం మోదీ సర్కార్ బయటపెట్టడం లేదు. సాధారణంగా పార్లమెంట్ ప్రతి ఏటా మూడు (బడ్జెట్, వర్షాకాల, శీతాకాల) మార్లు సమావేశమవుతుంది.