న్యూఢిల్లీ, జనవరి 13: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. 31న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడతారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ శుక్రవారం వెల్లడించారు.
తొలివిడత సమావేశాలు ఫిబ్రవరి 14న ముగుస్తాయని చెప్పారు. అనంతరం మార్చి 12న మలివిడత సమావేశాలు ప్రారంభమై ఏప్రిల్ 6తో ముగుస్తాయని పేర్కొన్నారు.