పట్నా: దేశంలో నానాటికి ఒమిక్రాన్ (Omicron) వైరస్ విస్తరిస్తుండటంతో బీహార్ ప్రభుత్వం అప్రమత్తమయింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 31 నుంచి మూడు రోజులపాటు పార్కులను మూసివేయనున్నట్లు ప్రకటించింది. ప్రధాన పార్కయిన జైవిక్ ఉద్యాన్ కూడా వచ్చే శుక్రవారం నుంచి సోమవారం వరకు మూతపడుతాయని ఆదేశాలు జారీచేసింది. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. రాష్ట్రంలోని ఏ పార్కులోనూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరగవని తెలిపింది. అదేవిధంగా మూడు రోజులపాటు రాజకీయ, సామాజిక, మతపరమైన, సాంస్కృతిక, క్రీడా పరమైన కార్యకలాపాలు నిర్వహించాలంటే ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అందులో పేర్కొన్నది.
దేశంలో నిన్న 6358 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంకా 75,456 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా 653 కరోనా వేరియంట్ కేసులు రికార్డయ్యాయని చెప్పింది.