ఒమిక్రాన్ వైరస్ పిల్లలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో వైద్యులు ఓ ప్రముఖమైన సూచన చేశారు. ఒమిక్రాన్ వల్ల పిల్లలు ప్రభావితం కాకూడదంటే మొదట తల్లిదండ్రులు రెండు డోసులనూ తీసుకోవాలని ఢిల్లీలోని రైన్బో చిల్ట్రన్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ నితిన్ వర్మ సూచించారు. రెండు డోసులను తీసుకోవడంతో పాటు తల్లిదండ్రులు కచ్చితంగా కరోనా నియమాలను పాటించాలని కూడా సూచించారు. ఒమిక్రాన్ వల్ల పిల్లలకు ప్రమాదమే కానీ, మరీ అంత తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాలని, వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ను పూర్తి చేస్తే ప్రమాదం తప్పే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభించారని నితిన్ వర్మ గుర్తు చేశారు.