Sharanya Suryavanshi | భోపాల్ : బిడ్డ పుట్టగానే బర్త్ సర్టిఫికెట్, ఆ తర్వాత ఆధార్ వంటి ఇతరత్రా ధ్రువపత్రాలు సంపాదించేందుకు ఎంతగానో కష్టపడాల్సి వస్తుంది. అయితే మధ్యప్రదేశ్లోని ఛింద్వాఢా జిల్లాకు చెందిన మూడు నెలల శరణ్య సూర్యవన్షికి 72 రోజుల వ్యవధినే ఏకంగా 31 రకాల ధ్రువపత్రాలు వచ్చాయి. దీంతో ఆ పాప వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకొన్నది.
ఛందన్గావ్కు చెందిన కేసరి నందన్ సూర్యవన్షి, ప్రియాంక దంపతులు తమ బిడ్డ పేరిట ఎప్పటికీ గుర్తుండేలా ప్రత్యేకంగా చేయాలనుకొన్నారు. 28 పత్రాలతో ఓ చిన్నారి రికార్డు సృష్టించిందన్న వార్త విని దాన్ని బద్దలు కొట్టాలనుకున్నారు. ఈ క్రమంలో శరణ్య పేరిట ఆధార్, పాన్ కార్డు, పాస్పోర్టు, పోస్టాపీసు ఇలా 31 పత్రాలు సంపాదించారు. దీంతో పాప శరణ్య ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్తోపాటు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకొన్నది.