న్యూఢిల్లీ: అమెరికన్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ను ఈస్ట్ ఇండియా 2.0 అంటూ అభివర్ణించడంపై ఆరెస్సెస్ అనుబంధ వారపత్రిక పాంచజన్య స్పందించింది. భారత్లో తమకు అనుకూల విధానాల కోసం అధికారులకు కోట్ల కొద్దీ లంచాల రూపంలో ఇచ్చిందని పాంచజన్య ఆరోపించిన విషయం తెలిసిందే. గతంలో ఐటీ పోర్టల్లో లోపాలపై తీవ్రంగా స్పందిస్తూ.. ఇన్ఫోసిస్ సంస్థపైనా చాలా ఘాటైన విమర్శలు గుప్పిస్తూ పాంచజన్య ఓ ఆర్టికల్ను ప్రచురించింది. ఇప్పుడు ఈ రెండు వివాదాలపై పాంచజన్య ఎడిటర్ హితేష్ శంకర్ స్పందించారు.
ఆజ్ తక్ న్యూస్ చానెల్తో ఆయన మాట్లాడుతూ.. అమెజాన్పై రాసిన ఈ ఆర్టికల్ పూర్తిగా వాస్తవాల ఆధారంగానే రాశామని, ఇందులో లేవనెత్తిన ప్రశ్నలకు అమెజాన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. సోషల్ మీడియాలోనూ అమెజాన్కు వ్యతిరేకంగా ట్రెండ్ కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ ఆర్టికల్లో తాము సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారస్తుల గురించి ప్రశ్నలను లేవనెత్తామని తెలిపారు.
ఇక గతంలో ఇన్ఫోసిస్పై తీవ్రమైన విమర్శలు చేస్తూ పాంచజన్యలో వచ్చిన ఆర్టికల్పైనా హితేష్ స్పందించారు. సాధారణ ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆ ఆర్టికల్ రాసినట్లు చెప్పారు. జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లను తయారు చేసిన ఇన్ఫోసిస్కు ఇచ్చిన డబ్బు సాధారణ ప్రజలు తమ కష్టార్జితంతో చెల్లించిన పన్నులదే అని, అలాంటప్పుడు అందులో లోపాలను సవరించని ఇన్ఫోసిస్ను ప్రశ్నిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.