న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియాను 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రిత్విక్ రంజనం పాండే ఈ సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తారని ఆదివారం వెలువరించిన నోటిఫికేషన్లో పేర్కొంది. కమిషన్ సభ్యుల వివరాలను ప్రత్యేకంగా నోటిఫై చేస్తామని తెలిపింది. ఈ ఆర్థిక సంఘం అయిదేండ్ల కాలానికి (2026-27 నుంచి 2030-31 వరకు) సంబంధించిన సిఫారసుల నివేదికను 2025 అక్టోబర్ 31న రాష్ట్రపతికి సమర్పిస్తుంది. కేంద్ర, రాష్ర్టాల మధ్య పన్నుల పంపిణీ, ఆదాయ వృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలతో పాటు విపత్తు నిర్వహణ నిధులను ఎలా ఖర్చు పెడుతున్నారనే విషయాన్ని ఈ సంఘం సమీక్షిస్తుంది.