ముంబై: షాపూర్జీ పల్లోంజి గ్రూపు అధినేత పల్లోంజి మిస్త్రీ ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 93 ఏళ్లు. స్వంత ఇంట్లోనే తుదిశ్వాస విడిచినట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. టాటా గ్రూపులో అత్యధిక వ్యక్తిగత షేర్హోల్డర్గా పల్లోంజి మిస్త్రీ ఉన్నారు. ఆయనకు 18.4 శాతం టాటా గ్రూపులో వాటా ఉంది. సోమవారం రాత్రి నిద్రలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
పల్లోంజి మిస్త్రీ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. వాణిజ్య, పరిశ్రమ రంగానికి పల్లోంజి అసాధారణ సహకారాన్ని అందించినట్లు చెప్పారు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు సంతాపం ప్రకటించారు. పల్లోంజి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.