మొరాదాబాద్: ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఆశ్చర్యకరమై విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్కు చెందిన మహిళ పేరు ఓటరు జాబితాలో కనిపించడం వివాదాస్పదమైంది. అయితే ఈ విషయం తెలియడంతో అధికారులు ఆమె పేరును ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారు.
పాకిస్థాన్కకు చెందిన సాబా పర్వీన్కు 2005లో నదీమ్ అహ్మద్తో వివాహమైంది. దీర్ఘాలిక వీసాపై ఉన్న ఆమె ప్రస్తుతం మొరాదాబాద్లోని పక్బరా నగర్ పంచాయతీ ప్రాంతంలో నివాసం ఉంటున్నది. 2017లో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా పర్వీన్ పేరును స్థానిక అధికారులు ఓటరు జాబితాలో చేర్చారు. అయితే ఓటరు జాబితాపై ఇటీవల నిర్వహించిన విచారణలో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ శైలేంద్ర కుమార్ సింగ్ చెప్పారు. దీంతో వెంటనే ఆమె పేరును ఓటరు జాబితా నుంచి తొలగించామన్నారు. మరోసారి ఇలాంటివి జరుగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.