Gujarat | అహ్మదాబాద్ : ఇండియా( India )లోకి ప్రవేశించేందుకు యత్నించిన పాకిస్థాన్ దేశస్తుడిని( pakistan National ) బీఎస్ఎఫ్ జవాన్లు( BSF Jawans ) గుజరాత్( Gujarat )లోని బనస్కాంత జిల్లాలో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ సరిహద్దు( International Border ) గుండా మంగళవారం భారత్లోకి పాకిస్తానీ ప్రవేశించేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. బనస్కాంత జిల్లాలోని నాదేశ్వరి బోర్డర్ ఔట్ పోస్టు సమీపంలో ఉన్న గేటును ఎక్కి దిగుతున్న వ్యక్తిని బలగాలు పసిగట్టి అదుపులోకి తీసుకున్నాయి.
అదుపులోకి తీసుకున్న వ్యక్తిని దయా రామ్గా పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్లోని నగర్పర్కార్కు చెందిన వ్యక్తి అని పోలీసులు నిర్ధారించారు. అతను పూర్తిగా భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. దయా రామ్ ఇండియాలోకి ఎందుకు ప్రవేశించాడు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.