న్యూఢిల్లీ: పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి(Bilawal Bhutto Zardari).. భారత్లో పర్యటించనున్నారు. గోవాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) భేటీకి ఆయన హాజరవుతారు. ఆ సమావేశాల్లో విదేశాంగ మంత్రులు పాల్గొననున్నారు. మే 4వ తేదీ నుంచి 5వ తేదీ వరకు గోవాలో జరగనున్న వేడుకల్లో పాక్ విదేశాంగ మంత్రి తన టీమ్తో పాల్గొననున్నారు. తాము ఆ మీటింగ్కు హాజరుకావడం ఎస్సీవో పట్ల పాక్ కట్టుబడి ఉందన్న సంకేతాన్ని ఇస్తుందని విదేశాంగ శాఖ ప్రతినిధి ముంతాజ్ జహరాహ్ బలోచ్ తెలిపారు. పాక్ తమ విదేశాంగ విధానంలో ఎస్సీవో మీటింగ్ ప్రాధానత్య ఇస్తుందని చెప్పారు.
అయితే 2014 తర్వాత తొలిసారి పాకిస్థాన్కు చెందిన మంత్రి ఇండియాలో టూర్ చేయనున్నారు. 2014లో చివరి సారి అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ .. ఇండియాలో పర్యటించారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఆయన ఇండియా వచ్చారు. షాంఘై గ్రూపులో మొత్తం 8 సభ్యదేశాలు ఉన్నాయి. ఎస్సీవోలో చైనా,ఇండియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు ఉన్నాయి.